న్యూస్ రౌండప్ టాప్ 20

1.సీఎం కారు తనిఖీ

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ స్క్వాడ్ ఆకస్మికంగా తనిఖి చేసింది.

2.ఈడీ కార్యాలయానికి రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ  వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు ఈడి కార్యాలయానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు.ఈడీతోbపాటు ఏసీబీ, సిబిఐకి రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు.

3.ఎమ్మెల్యే మేకపాటికి అస్వస్థత

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

 వైసిపి బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు.మర్రిపాడు లోని ఇంటిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

4.జగనన్న కాలనీల్లో అవినీతి

జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా అవినీతిమయమని,  ఇళ్ల స్థలాల సేకరణ కోసం వైసిపి ఎమ్మెల్యేలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని టిడిపి నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు.

5.భారత్ లో కరోనా

Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold

గడిచిన 24 గంటలు దేశవ్యాప్తంగా కొత్తగా 3095 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.జగన్ పై విష్ణుకుమార్ రాజు విమర్శలు

అమరావతి రైతుల ఉద్యమానికి బిజెపి ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంఘీభావం తెలిపారు .ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు.రాజధాని రైతులపై పెట్టిన కేసులుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

7.తిరుమల సమాచారం

Advertisement

తిరుమలలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది.స్వామివారి దర్శనానికి 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉన్నారు.

8.  బిజెపి బీఆర్ఎస్ పై జీవన్ రెడ్డి కామెంట్స్

బిజెపి బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.

9.కొట్టుకున్న టిడిపి వైసిపి కౌన్సిలర్లు

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.సభ జరుగుతుండగా వైసీపీ,  టిడిపికి చెందిన ఇరు పార్టీల కౌన్సిలర్లు కొట్లాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

10.నేడు మన్యం బంద్

నేడు మన్యం బంద్ కు  ఆదివాసి సంఘాలు పిలుపునిచ్చాయి .బోయ ,వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంపై గిరిజనులలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

11.ఏపీకి వర్ష సూచన

రాబోయే మూడు రోజులలో ఏపీలో  వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

12.ఏపీ తెలంగాణలో నూతన బిజెపి ఆఫీస్ లు

నేడు సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ తో పాటు ఏపీలోని అనంతపురం చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయాలను ఢిల్లీ నుండి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ ద్వారా ప్రారంభించారు.

13.నేడు భద్రాచలం లో.

నేడు భద్రాచలంలోని నిఖిల స్టేడియంలో శ్రీరామ పుష్కర పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.

14.నేడు ధ్వజారోహణం

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో నేడు ధ్వజారోహణం సాయంత్రం శేష వాహన సేవ.

15.ఎం ఎస్ ఎం ఈ కార్పొరేషన్ చైర్మన్ గా

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

 నేడు ఏపీఎంఎస్ ఎంఏ కార్పొరేషన్ చైర్మన్ గా ఆడారి ఆనంద్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.

16.ఉపాధ్యాయ సంఘం కౌన్సిల్ సమావేశం

నేడు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరగనుంది.

17.నేటి నుంచి ఐపీఎల్

Advertisement

నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది అహ్మదాబాద్ వేదిక తొలి మ్యాచ్ లో గుజరాత్ వర్సెస్ చెన్నై తలపడనున్నాయి.

18.జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన రద్దు

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నటన హైదరాబాద్ పర్యటన రద్దయింది.

19.భూ హక్కు పై జగన్ సమీక్ష

వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం పై క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 60000.

తాజా వార్తలు