కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ స్క్వాడ్ ఆకస్మికంగా తనిఖి చేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు ఈడి కార్యాలయానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు.ఈడీతోbపాటు ఏసీబీ, సిబిఐకి రేవంత్ ఫిర్యాదు చేయనున్నారు.
వైసిపి బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు.మర్రిపాడు లోని ఇంటిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
జగనన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలు పూర్తిగా అవినీతిమయమని, ఇళ్ల స్థలాల సేకరణ కోసం వైసిపి ఎమ్మెల్యేలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని టిడిపి నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు.
గడిచిన 24 గంటలు దేశవ్యాప్తంగా కొత్తగా 3095 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అమరావతి రైతుల ఉద్యమానికి బిజెపి ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంఘీభావం తెలిపారు .ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ పై విమర్శలు చేశారు.రాజధాని రైతులపై పెట్టిన కేసులుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.స్వామివారి దర్శనానికి 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేసి ఉన్నారు.
బిజెపి బీఆర్ఎస్ రెండు పార్టీలు దొంగలే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు.
ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొంది.సభ జరుగుతుండగా వైసీపీ, టిడిపికి చెందిన ఇరు పార్టీల కౌన్సిలర్లు కొట్లాటకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
నేడు మన్యం బంద్ కు ఆదివాసి సంఘాలు పిలుపునిచ్చాయి .బోయ ,వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడంపై గిరిజనులలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
రాబోయే మూడు రోజులలో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నేడు సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, జనగామ, మహబూబాబాద్ తో పాటు ఏపీలోని అనంతపురం చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయాలను ఢిల్లీ నుండి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ ద్వారా ప్రారంభించారు.
నేడు భద్రాచలంలోని నిఖిల స్టేడియంలో శ్రీరామ పుష్కర పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో నేడు ధ్వజారోహణం సాయంత్రం శేష వాహన సేవ.
నేడు ఏపీఎంఎస్ ఎంఏ కార్పొరేషన్ చైర్మన్ గా ఆడారి ఆనంద్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరగనుంది.
నేటి నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది అహ్మదాబాద్ వేదిక తొలి మ్యాచ్ లో గుజరాత్ వర్సెస్ చెన్నై తలపడనున్నాయి.
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నటన హైదరాబాద్ పర్యటన రద్దయింది.
వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం పై క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 60000.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy