News Roundup: న్యూస్ రౌండప్ టాప్ 20

1.స్వామీజీలు బ్రోకర్లు మాకు అవసరమా : కిషన్ రెడ్డి

ఇతర పార్టీలలోని నాయకులను చేర్చుకోవాలంటే ఆ శక్తి మాకు లేదా ? స్వామీజీలు బ్రోకర్లు మాకు అవసరమా అంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

 

2.కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి నోటీస్

  కాంగ్రెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి ఆ పార్టీ షాకజ్ నోటీసులు జారీ చేసింది. 

3.డి ఏవి స్కూల్ పునః ప్రారంభం

 

బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 14 లోని డీ ఏ వి స్కూలుకు మళ్లీ అధికారులు అనుమతులు మంజూరు చేయడంతో తిరిగి స్కూల్ ప్రారంభమైంది. 

4.ఫాం హౌస్ కేసును సీబీఐ కి అప్పగించండి

  మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాల వ్యవహారం పై సిబిఐతో విచారణ చేయించాలని ఈ కేసులు రెండో నిందితుడిగా ఉన్న నందకుమార్ భార్య పిటిషన్ దాఖలు చేశారు. 

 5.బిజెపి జనసేన పొత్తు పై కేంద్ర మంత్రి కామెంట్స్

 

బిజెపి జనసేన పొత్తు అంశంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.ఏపీలో జనసేనతోనే కలిసి వెళ్తున్నామని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

6.వైసిపి ప్రభుత్వం పై పవన్ కామెంట్స్

  కూల్చివేతల ప్రభుత్వం కూలిపోతుంది అంటూ వైసిపి ప్రభుత్వం ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. 

7.రామగుండానికి రానున్న ప్రధాని

 

Advertisement

ఈనెల 12వ తేదీన రామగుండానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. 

8.మునుగోడులో 93 శాతం పోలింగ్

  నిన్న జరిగిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ లో 93 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

9.ఇప్పటం గ్రామంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

 

జనసేన ఆవిర్భావ దినోత్సవంకు స్థలం ఇచ్చిన నాటి నుంచి ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. 

10.అస్సాగో ఇథనాల్ శుద్ది కర్మాగారానికి జగన్ శంకుస్థాపన

  తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం, గుమ్మళ్ళ దొడ్డిలో ఇథనాల్ శుద్ది కర్మాగారానికి ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. 

11.ఏపీ అరాచకాలపై కేంద్రం దృష్టిపెట్టాలి

 

ఏపీలో చోటుచేసుకుంటున్న అరాచక పాలన పై కేంద్రం వెంటనే దృష్టి పెట్టాలని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు కోరారు. 

12.పెద్ద పులి కలకలం

 శ్రీశైలం ఘాట్ రోడ్డు లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. 

13.పవన్ కళ్యాణ్ కు భద్రత కావాలంటే ఇస్తాం

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు భద్రత కావాలంటే ఇస్తామంటూ బీజేపీ నేత , ఎంఎల్ సీ మాధవ్ అన్నారు. 

14.అయ్యన్న పాత్రుడి సంచలన వ్యాఖ్యలు

  తనపై ఎన్ని కేసులు పెట్టిన ఎవరు ఏమి పీకలేరు అంటూ టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. 

15.అమరావతి పిటిషన్లపై విచారణ

 

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై విచారణ జరిగింది. 

16.విశాఖలో జీవీఎంసీ సమావేశం

  విశాఖలో జీవీ ఎంసి సమావేశం జరుగుతోంది.అజెండాలో ని 25 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

17.కాకినాడలో నాదెండ్ల మనోహర్ పర్యటన

 

Advertisement

కాకినాడలో జనసేన పిఎసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. 

18.భవాని దీక్షలు ప్రారంభం

  విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవాని దీక్షలు ప్రారంభం కానున్నాయి. 

19.అన్నవరంలో భక్తుల రద్దీ

 

కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,100   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 50,290.

తాజా వార్తలు