అనుష్క అందుకే ఆ సీనియర్ హీరోతో నటించలేదట...

టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో బ్యూటీఫుల్ హీరోయిన్ "స్వీటీ అనుష్క" గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు.

ఈ అమ్మడు అప్పట్లో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "సూపర్" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది.

ఆ తర్వాత వరుసగా పలువురు స్టార్ హీరోల సరసన నటించి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.కాగా నటి అనుష్క ఆ మధ్య బాహుబలి, భాగమతి తదితర హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కాగా తాజాగా నటి అనుష్క కి సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అప్పట్లో సౌత్ సూపర్ స్టార్ "రజనీ కాంత్" హీరోగా నటించిన "కొచ్చడయాన్" చిత్రంలో మొదటగా హీరోయిన్ గా అనుష్క శెట్టి కి అవకాశం వచ్చిందట.

కానీ అనుష్క శెట్టి పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే లేక పోయిందట.దీంతో ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే వరించింది.

Advertisement

కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.అయితే ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ సభ్యులు దాదాపుగా 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ వెచ్చించినప్పటికీ కనీసం వంద కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేక పోయింది.

ఆ తర్వాత అనుష్క రజనీకాంత్ తో కలిసి "లింగ" చిత్రంలో నటించింది.ఈ చిత్రం పర్వాలేదనిపించినప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా అనుష్క శెట్టి "నిశ్శబ్దం" అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.దీంతో ఈ అమ్మడు తన తదుపరి చిత్ర కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తోంది.

కాగా ఆ మధ్య జాతి రత్నాలు మూవీ ఫేమ్ నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తోందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నప్పటికీ అనుష్క మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం
Advertisement

తాజా వార్తలు