ఇన్‌స్టా లో నాలుగు మిలియన్ క్లబ్ లో అనుష్క!

2005 సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సూపర్ సినిమా ద్వారా అనుష్క టాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు.

హీరోయిన్ గా అదే సంవత్సరంలో మంచు విష్ణు హీరోగా మహానంది సినిమాలో హీరోయిన్ గా నటించింది.

తరువాత వరుస సినిమాల్లో నటిస్తూ, లేడీ ఓరియంటెడ్ సినిమా అరుంధతి లో జేజమ్మ పాత్రలో నటించి ఎంతో మందిని తన నటన ద్వారా మెప్పించింది.బాహుబలి లో దేవసేనగా ఎంతో కీలకమైన పాత్ర పోషించిన అనుష్క సోషల్ మీడియాకు దూరంగా ఉండేది.

సినిమాలతో బిజీగా ఉండే అనుష్క సోషల్ మీడియాలో పెద్దగా కనిపించేది కాదు.కానీ లాక్ డౌన్ కారణంగా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీస్ ఏదో ఒక విధంగా అభిమానులను అలరించే వారు.

ఈ సమయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నా అనుష్క కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తున్నారు.ఈ ముద్దుగుమ్మ ఒక్కసారి సోషల్ మీడియాలో కనిపించే సరికి, అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది ఫాలోవర్ లను సంపాదించుకుంది తను తాజాగా నటించిన నిశ్శబ్దం సినిమా ప్రమోషన్ లో భాగంగా, ట్విట్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అనుష్క సినిమా కు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులకు దగ్గరవుతున్నారు.

Advertisement

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జేజమ్మ ను ఫాలో అయ్యే వారి సంఖ్య 4 మిలియన్లకు చేరుకుంది ఇంత తక్కువ సమయంలో నే ఇంత మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న అనుష్క ఈ సందర్భంగా తన ఫాలోవర్స్ కు తన ఫోటో లతో డిజైన్ చేసిన నాలుగు మిలియన్స్ పోస్టును షేర్ చేస్తూ. thank you.smile always.love అనుష్క అని సంతకం చేసిన పోస్టర్లు ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకర్షించింది.

ఈ సందర్భంగా 4 మిలియన్ క్లబ్ లో చేరిన అనుష్కకు తన అభిమానులు కూడా తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.అయితే ప్రస్తుతం నిశబ్దం సినిమా తర్వాత దేవసేన ఎటువంటి సినిమాలను చేయలేదు.

Advertisement

తాజా వార్తలు