తమిళ సినిమా కోసం మూడు కోట్లు డిమాండ్ చేసిన స్వీటీ

ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్ననటి అనుష్క శెట్టి.

ఈ అమ్మడు 15 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం ఈ స్వీటీ నటించిన నిశ్శబ్దం సినిమా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.త్వరలో ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఇండో-హాలీవుడ్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.హాలీవుడ్ నటులు సైతం ఇందులో నిశ్శబ్దం సినిమాలో కీలక పాత్రలో నటించాడు.

ఇదిలా ఉంటే తాజాగా స్వీటీ మరో కొత్త సినిమాకి ఒకే చెప్పినసంగతి తెలిసిందే.విజయ్ సేతుపతికి జోడీగా తమిళ సినిమాలో అనుష్క నటిస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమా కోసం అనుష్క రెమ్యునరేషన్ భారీగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.సినిమా కోసం తనకి మూడు కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాలని ఆమె నిర్మాతలకి ముందే క్లారిటీగా చెప్పేసినట్లు టాక్.

తాను బహుభాషా నటినని, తన చిత్రాలకు తెలుగు, తమిళం తదితర భాషల్లో మంచి ఆదరణ ఉంటుందని, కాబట్టి తన పారితోషికం విషయంలో తగ్గే సమస్య లేదని అనుష్క కరాఖండిగా చెప్పినట్లు సమాచారం.ఈ చిత్రంలో నటించనున్న విజయ్‌ సేతుపతి రూ.10 కోట్లు పారితోషికం ఇస్తుండగా తనకు రూ.3 కోట్లు ఇవ్వడం న్యాయం అని అనుష్క పేర్కొన్నట్లు టాక్.దీంతో చేసేదిలేక చిత్ర దర్శక నిర్మాతలు ఈ బ్యూటీకి డిమాండ్‌ చేసిన మొత్తాన్ని ఇవ్వడానికి అంగీకరించక తప్పలేదని తెలిసింది.

కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లాక్‌ డౌన్‌ ముగిసిన తర్వాత సెట్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.ఇదిలా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత అనుష్క ఇక సినిమాలు చేసే అవకాశం ఉందదని, ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని బోగట్టా.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు