బాలీవుడ్ లో మరో బ్రేకప్..!

కొన్నాళ్లుగా సిద్ధార్థ్ మల్హోత్రా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కియరా అద్వాని ఇద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇద్దరు కలిసి షేర్షా సినిమాలో నటించగా ఆ మూవీ టైం లోనే ఇద్దరి అభిరుచులు కలిశాయని అప్పటి నుండి ఎక్కడ కనిపించినా ఇద్దరు కలిసి కనిపించడంతో వీరి జోడీ హాట్ టాపిక్ అయ్యింది.

వీరిపై ఎన్ని వార్తలు వచ్చినా సిద్ధార్థ్ గాని, కియరా గాని స్పందించకపోయే సరికి దాదాపు వీరి లవ్ ట్రాక్ కన్ఫర్మ్ అయ్యింది.ఈ క్రమంలో నేడో రేపో వీరు కూడా పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు.

తీరా చూస్తే ఇప్పుడు బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారిన వారు చూసుకున్నారని తెలుస్తుంది.ముంబై మీడియా సమాచారం ప్రకారం సిద్ధార్థ్, కియరా కొన్నాళ్లుగా లవ్ ట్రాక్ నడిపించినా మధ్యలో వ్యవహారం ఎక్కడో తేడా కొట్టడంతో ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారని అంటున్నారు.

ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారని ఈమధ్య అసలు వారు కలిసి కనిపించడం లేదని అంటున్నారు.అయితే నిజంగానే సిద్ధార్థ్ మల్హోత్రా, కియరా అద్వాని విడిపోయారా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.

Advertisement

 కియరా అద్వాని బాలీవుడ్ సినిమాలతో పాటుగా తెలుగులో చరణ్, శంకర్ సినిమాలో నటిస్తుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు