అలా పిలవడం అస్సలు నచ్చదంటున్న యాంకర్ అనసూయ.. ఏం జరిగిందంటే?

బుల్లితెర యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో పాటు పలు సందర్భాల్లో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.

పుష్ప సినిమాలో దాక్షాయణి రోల్ లో అనసూయ మెప్పించగా ఆమె పాత్ర నిడివి మరీ తక్కువగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే పుష్ప పార్ట్2 లో దర్శకుడు సుకుమార్ అనసూయ పాత్రకు ఎక్కువగానే ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది.ఈ ఏడాదే పుష్ప పార్ట్2 రిలీజ్ కానుంది.

అయితే సోషల్ మీడియాలో అనసూయ ఈ మధ్య కాలంలో తరచూ ట్రోల్స్ కు గురవుతున్నారు.తాజాగా అనసూయ నెటిజన్లతో ముచ్చటిస్తుండగా ఒక నెటిజన్ అనసూయ ఆంటీ లేదా అక్కా ఏమని పిలవాలి అని అడిగారు.

ఆ వ్యక్తికి అనసూయ బదులిస్తూ నేను నీకు అంత ఎక్కువగా పరిచయం లేదని అలా పిలవాల్సిన అవసరం లేదని కామెంట్లు చేశారు.నువ్వు చేసిన కామెంట్ ఏజ్ షేమింగ్ కిందికి వస్తుందని నీ పెంపకంపై అనుమానం వస్తుందని అనసూయ కామెంట్ చేశారు.

Advertisement

అయితే అనసూయ నెటిజన్ కామెంట్ కు ఆ విధంగా సమాధానం ఇవ్వడం సరికాదని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.అక్క అని పిలిస్తే ఆ పిలుపు ఏజ్ షేమింగ్ కాదని అలాంటప్పుడు ప్రశంసలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదని ఒక నెటిజన్ అన్నారు.ఆ కామెంట్ కు అనసూయ స్పందిస్తూ అలా పిలవడం ఏజ్ షేమింగ్ కాకపోయినా నేను ఏం చెప్పానో మీకు తెలుసని అనసూయ వెల్లడించారు.

ప్రశంసలు తీసుకోవాలా? వద్దా? అనేది ఒకరి ఇష్టమని ఆమె వెల్లడించారు.నావ సముద్రంపై మాత్రమే ఈదగలదని సముద్రాన్ని నావ లోపలికి రానిస్తే నావ మునిగిపోతుందని అనసూయ చెప్పుకొచ్చారు.

జన సముద్రం నుంచి దేనిని ఎంత తీసుకోవాలో బాగా తెలుసని అనసూయ అన్నారు.

10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు