రాజధానిపై కేంద్ర ప్రభుత్వ వైఖరినీ స్పష్టం చేయాలని సోమువీర్రాజును డిమాండ్ చేసిన రాజదాని రైతులు

అమరావతి : బీజేపీ తలపెట్టిన మనం మన అమరావతి పాదయాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజును ప్రశ్నించారు అమరావతి రైతులు.

బీజేపీ వైఎస్ఆర్సీపీ రెండు తోడు దొంగలు అంటూ విమర్శిస్తున్న పెనుమాక రైతులు.

రాజధానిపై కేంద్ర ప్రభుత్వ వైఖరినీ స్పష్టం చేయాలని సోమువీర్రాజును రాజదాని రైతులు డిమాండ్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సరిగ్గా చేసి ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయేవాడు కాదు గా అని రాజదాని రైతులకు సమాధానం ఇచ్చిన సోమువీర్రాజు.

ఆంధ్రప్రదేశ్ కు ఓకే రాజధాని అని బీజేపీ గతం లో స్పష్టం చేసిందని కేంద్రం కూడా ఒక్క రాజదాని ఉండాలని కట్టుబడి ఉంటుందని అమరావతి రైతులకు సోమువీర్రాజు వివరించారు.అమరావతి స్మార్ట్ సిటీ కింద కేంద్రం 2500 కోట్లు కేటాయించిందని 5 ఏళ్లో పూర్తి చేయాల్సిన రాజదానినీ నిర్మించటం చంద్రబాబుకి చేతకాలేదని అందుకే ప్రజలు కొత్త ప్రభుత్వనీ ఎన్నుకున్నారని సోమువీర్రాజు రైతులకు తెలిపారు.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు