'డిప్రెషన్'కు గురైన అల్లు అర్జున్.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ గురించి ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే.

ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ తన వ్యక్తిగత విషయంలో నిరాశ పడలేదని అందరికీ తెలుసు.

కానీ గతంలో అల్లు అర్జున్ ఓ విషయంలో బాగా డిప్రెషన్ కు గురయ్యాడట.అలా కావడానికి కారణం తెలిస్తే పక్క షాకవ్వాల్సిందే అని అనిపిస్తుంది.

తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి అల్లు అర్జున్ బాలనటుడుగా పరిచయమయ్యాడు.ఆ తర్వాత చిరంజీవి నటించిన డాడీ సినిమాలో అతిథి పాత్రలో నటించాడు.

Advertisement

ఇక 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ను అందించింది.

ఆ తర్వాత నటించిన ఆర్య, బన్నీ, హ్యాపీ, దేశముదురు వంటి పలు సినిమాలు మంచి హిట్ ను అందించాయి.ఇక వరుస హిట్ లతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ ఒకేసారి డిప్రెషన్ లోకి వెళ్ళాడు.

2009లో తాను నటించిన ఆర్య 2, వరుడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో బాగా నిరాశ చెందాడు.అప్పటికే ఆర్య 2 నిరాశలో ఉన్న అల్లు అర్జున్ వరుడు పై బాగా ఆశలు పెట్టుకున్నాడు.ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన గుణశేఖర్ కూడా ఈ సినిమాపై బాగా హైప్ పెంచాడు.

కానీ సినిమా విడుదల తర్వాత అల్లు అర్జున్ కి పెద్ద షాక్ తగిలింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

సినిమా హిట్ కాకపోవడంతో అల్లు అర్జున్ నిరాశ చెందాడట.ఇంట్లోనే చిరాకుగా ఉన్నాడట.ఆ సమయంలో డైరెక్టర్ గుణశేఖర్ తనను కలవడానికి వచ్చిన కూడా ఇష్టపడలేదని పైగా ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో చాలామంది వరుడు సినిమా ప్లాఫ్ తో డిప్రెషన్ కి గురయ్యాడని అన్నారు.

Advertisement

ఇక ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానులు బాగా షాక్ అయ్యారని తెలిసింది.అలా ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుని నటించగా అందులో జులాయి, ఇద్దరమ్మాయిలు, ఎవడు, సన్నాఫ్ సత్యమూర్తి, డీజే వంటి సినిమాలు మంచి సక్సెస్ ఇచ్చాయి.

ఇక గత ఏడాది అలా వైకుంఠపురం లో సినిమాలో మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ప్రస్తుతం మరో పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాలతో ఈ సినిమా రూపొందుతుంది.ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.

అక్రమ రవాణా గంధపుచెక్కల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ఫస్ట్ లుక్ లు విడుదల కాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 17న పలు భాషలలో విడుదల కానుంది.ఇటీవలే అల్లు అర్జున్ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు