అల్లు అర్జున్ సినిమా లతో ఎంత బిజీగా ఉన్నా కూడా కుటుంబంతో కలిసి చాలా సరదగా సమయంను గడుపుతూ ఉంటాడు.ఇద్దరు పిల్లలతో రెగ్యులర్ గా అల్లు అర్జున్ మరియు ఆయన భార్య స్నేహారెడ్డి లు ఫొటో షూట్ లు చేయడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం చేస్తున్నారు.
ఇక అల్లు వారి ఫ్యామిలీ పండుగల సమయంలో ప్రత్యేకంగా గేదర్ అవ్వడం కామన్ గా చూస్తూ ఉంటాం.కాని ఈసారి కరోనా అవ్వడం వల్ల ఫ్యామిలీ అంతా కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది.
అందుకే అందుబాటులో ఉన్న వారి వరకు హోలీ వేడుకలో పాల్గొన్నారట.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో లో బన్నీ ఈ ఏడాది హోలీ వేడుకలు చేసుకున్న తీరును గమనించవచ్చు.
ఈ ఏడాది హోలీ వేడుక బన్నీకి మర్చి పోలేకుండా అద్బుతమైన పుష్ప సినిమా రాబోతుంది.పుష్ప సినిమా కోసం పెంచిన గడ్డం తోనే బన్నీ వేడుకలో పాల్గొన్నాడు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫొటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డిని ఈ ఫొటోలో చూడవచ్చు.ఇక ఎప్పటిలాగే అల్లు అర్హా కూడా ఈ ఫొటోలో సందడి చేస్తోంది.అమ్మా నాన్నలకు సాధ్యం అయినంతగా రంగును పూసేందుకు పైకి ఎక్కి నిల్చుంది.
మరి బుడ్డోడు అల్లు అయాన్ ఎక్కడ ఆడుతున్నాడు అంటూ నెటిజన్స్ ఈ ఫొటోకు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి అల్లు వారి హోలీ వేడుక పొటోతో అందరి దృష్టిని ఆకర్షించారు.
మరో వైపు కరోనా పెరుగుతున్న సమయంలో ఇలాంటి హోలీ వేడుకలు అవసరమా అంటున్నారు.ఈ వేడుకల ఫొటో చూసి కొందరు అయినా ఇన్సిపైర్ అయ్యి హోలీ ఆడుకోరా అంటూ కొందరు నెటిజన్స్ బన్నీ మరియు స్నేహా రెడ్డిలను ప్రశ్నిస్తున్నారు.