కాస్త ముందే రానున్న అక్కినేని ప్రిన్స్‌

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ డెబ్యూ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను యువ హీరో నితిన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.గతంలో ఏ కొత్త హీరో సినిమాకు ఖర్చు చేయని బడ్జెట్‌ను నితిన్‌ ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నాడు.

నితిన్‌ పెడుతున్న ఖర్చుకు అంతా కూడా షాక్‌ అయ్యారు.అయితే నితిన్‌ పెట్టిన దాని కంటే కూడా ఎక్కువ మొత్తంలో అఖిల్‌ సినిమా విడుదలకు ముందే బిజినెస్‌ చేసి పెట్టింది.

విడుదల తర్వాత మరింతగా నితిన్‌కు లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.ఇక ఈ సినిమా విడుదల తేదీలో చిన్న మార్పు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

Advertisement

ముందుగా అనుకున్నదాని ప్రకారం ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 22న విడుదల చేయాలని భావించారు.అయితే కారణాలేంటో తెలియదు కాని ఒక రోజు ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు వినాయక్‌ మరియు నిర్మాత నితిన్‌ ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే నెలలో నాగార్జున పుట్టిన రోజున సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.అలాగే వచ్చే నెల 20 ఏయన్నార్‌ జయంతి సందర్బంగా ఆడియోను విడుదల చేయబోతున్నారు.

ఆ తర్వాత అక్టోబర్‌ 21న సినిమాను భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ సాహేసా సైగల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

లైగర్ ట్రైలర్ లో.. అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువకుడు ఎవరో తెలుసా?

Advertisement

తాజా వార్తలు