ఐశ్వర్య రాయ్ విలన్.. కీర్తి సురేష్ యువరాణి! మణిరత్నం మూవీ సెన్సేషన్

సౌత్ ఇండియా దర్శక దిగ్గజం మణిరత్నం మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత నవాబ్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు.

నవాబ్ సూపర్ సక్సెస్ తో ఊపు మీద ఉన్న మణిరత్నం నెక్స్ట్ తన కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రానికి సిద్ధం అవుతున్నారు.

పోన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్ తో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో జయం రవి, చియాన్ విక్రమ్, కార్తి, అమితాబచ్చన్ లాంటి స్టార్ కాస్టింగ్ చేస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కూడా భాగం అవుతున్నారు.

అందులో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కాగా, మరొకరు సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.ఇక హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషలలో రిలీజ్ కాబోయే ఈ సినిమా హిస్టోరికల్ నేపధ్యంలో నడిచే కథ అని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న మహారాణి పాత్రలో కనిపించాబోతుండగా, ఇక కీర్తి సురేష్ మాత్రం ఓ యువరాణి పాత్రలో కనిపిస్తుందని సమాచారం.రోబో తర్వాత ఐశ్వర్య రాయ్ చేస్తున్న సౌత్ చిత్రం ఇదే కావడం ఒక ఎత్తయితే మణిరత్నం సినిమాలో మొదటి సారి, అలాగే కెరియర్ లో కూడా మొదటి సారి ఐశ్వర్య నేగితిస్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ఇక మహానటి తర్వాత కమర్షియల్ హీరోయిన్ గానే సినిమాలు చేసిన కీర్తి సురేష్ కి కూడా మరో సారి పవర్ ఫుల్ పాత్ర దొరికిందని తెలుస్తుంది.

Advertisement
భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు