విమాన ప్రయాణికులకు Air India గుడ్‌న్యూస్‌.. షడ్రుచులతో కొత్త మెనూ రెడీ!

Air Indiaను ఇటీవల టాటా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో కొత్త యాజమాన్యం ఎయిరిండియాకు కొత్త రూపు తెచ్చేలా కొన్ని చిన్న చిన్న మార్పులకు శ్రీకారం చుట్టింది.

అవును, విమాన ప్రయాణికులకు Air India తాజాగా ఓ శుభవార్త అందించింది.ఇకపై విమానాల్లో ట్రావెల్ చేసే వారి కోసం సరికొత్త వంటకాలతో నూతన మొనూను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నోరూరించే రుచులతో కొత్త వంటకాలతో ప్రయాణీకులకు అలరించేందుకు సిద్ధమైంది.ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎయిర్‌ ఇండియా యాజమాన్యం ఈ సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

తమ దేశీయ విమాన సర్వీసుల్లోనూ కొత్త మెనూ Air India తీసుకురావడం విశేషం.అక్టోబరు 1 నుంచి ఈ మెనూ అమలు చేస్తున్నారు.

Advertisement

ఇంతకీ ఎయిర్‌ ఇండియా అందించే ఈ మెనూలో ఏమున్నాయో తెలిసే మీకు నోరూరిపోవడం ఖాయం.ఇందులో చికెన్ 65, బ్లూబెర్రీ వెనిల్లా పేస్ట్రీలు, గ్రిల్డ్ స్లైస్డ్ పెస్టో చికెన్ శాండ్విచ్ లు మెనూలో ఉన్నాయి.

బిజినెస్ క్లాస్ మెనూ విషయంలో ఆలూ పరాటా, చికెన్ చెట్టినాడ్, షుగర్ ఫ్రీ డార్క్ చాకోలేట్ ఓట్ మీల్ మఫ్ఫిన్, ఫిష్‌ కర్రీ, మేదు వడ, మస్టర్డ్ క్రీమ్ చికెన్ సాసేజ్, ముంబయి బటాటా వడ, బంగాళాదుంప ఇగురు, ఇడ్లీ తదితర వంటకాలను అందిస్తున్నారు.

ఇక ఎకానమీ క్లాస్ లో ప్రయాణించే వారి కోసం చీజ్ మష్రూమ్ ఆమ్లెట్, డ్రై జీరా ఆలూ వెడ్జెస్, వెజ్ బిర్యానీ, మలబార్ చికెన్ కర్రీ, మిక్స్ డ్ వెజిటబుల్ కర్రీ, వెల్లుల్లి కలిపిన బచ్చలికూర-మొక్కజొన్న, వెజిటబుల్ ఫ్రైడ్ నూడిల్స్, చిల్లీ చికెన్ తదితర ఐటమ్ లు అందిస్తున్నారు.ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మెనూ రూపొందించినట్టు ఎయిరిండియా ప్రయాణికుల సేవా విభాగం అధిపతి సందీప్ వర్మ తెలిపారు.ఈ నిర్ణయంతో ఎయిర్ ఇండియాలో ప్రయాణాలు పెరుగుతాయని వారు ఆశిస్తున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు