కాసేపట్లో గాంధీభవన్ లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ

హైదరాబాద్ లోని గాంధీభవన్ లో( Gandhi Bhavan ) మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ( Congress Pradesh Election Committee ) సమావేశం జరగనుంది.

సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిచంనున్నారు.

డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన టికెట్ ఆశిస్తున్న ఆశావహుల పేర్లను పీఈసీ పరిశీలించనుంది.ఈ క్రమంలోనే అర్హులైన ఆశావహుల జాబితాపై ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చర్చించనుంది.కాగా ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థులను( Congress Candidates ) ప్రకటించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 
Advertisement

తాజా వార్తలు