ముఖ్యమంత్రి జగన్ ని పొగడ్తలతో ముంచేసిన రాశికన్నా

ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా దిశ చట్టం తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇక దిశ చట్టం ప్రకారం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు హత్యలు వంటి నేరాలకు పాల్పడితే 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఉరిశిక్ష విధించడం జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన దిశ చట్టానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.మరో వైపు మహిళా సంఘాలు దిశ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి టాలీవుడ్లో హీరోయిన్స్ నుంచి కూడా ఊహించని విధంగా మద్దతు లభించింది.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దిశ చట్టంపై జగన్ ని ప్రశంసించారు.

ఇదిలా ఉంటే తాజాగా స్టార్ హీరోయిన్ రాశి కన్నా ఈ చట్టం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేసింది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని, ఈ చట్టం వల్ల తప్పు చేస్తే చనిపోతాననే భయం కలుగుతుందని అన్నారు.

Advertisement

ఇక ఈ దిశ చట్టాన్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తే మహిళలపై అత్యాచారాలను చాలావరకు నియంత్రించవచ్చని పేర్కొంది.జగన్ తీసుకున్న నిర్ణయం చూసి ఇతర రాష్ట్రాలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రశంసించింది.

ఇక రాశి కన్నాతో పాటు ఇతర హీరోయిన్లు కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన చట్టంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు