మరో బాలీవుడ్ హీరోయిన్ కి కరోనా పాజిటివ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాల నృత్యం చేస్తుంది.కోట్లాది మంది ప్రజలు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.

దేశంలో కూడా లక్షలాది ప్రజలు కరోనా బారిన పడి అల్లాడుతున్నారు.ప్రతి ఒక్కరు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.

ఈ పరిస్థితి ఇంకా ఎంత వరకు ఉంటుందో అర్ధం కాని విషయంగా ఉంది.ఈ కరోనా కారణంగా ధైర్యంగా బయటకి రాలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరిని కరోనా ఒకే విధంగా చూస్తుంది.ఇప్పటికే కొంత మంది సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడి చనిపోయారు.

Advertisement

ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా కరోనా కలవరం ఉంది.కొద్ది రోజుల క్రితం అమితాబచ్చన్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు.

అందాల సుందరి ఐశ్వర్య రాయ్ సైతం కరోనా బారిన పడి మళ్ళీ కోలుకుంది.ఇదిలా ఉంటే మరో మాజీ మిస్ ఇండియా వరల్డ్ కూడా కరోనా బారిన పడింది.

ప్రస్తుత బాలీవుడ్ లో హీరోయిన్ రాణిస్తున్న నటాషా సూరికి కరోనా సోకింది.ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది.

తనకి కరోనా వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా చెప్పింది.ఓ 6 రోజుల కిందట అర్జెంట్ పని మీద పుణె వెళ్లాను.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
క్రమం తప్పకుండా లిప్స్ స్టిక్ ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

అక్కడ్నుంచి ఇంటికొచ్చిన వెంటనే జ్వరం వచ్చింది.గొంతు నొప్పి, నీరసం కూడా ఆవహించింది.

Advertisement

అనుమానం వచ్చి 3 రోజుల కిందట టెస్ట్ చేయించుకున్నాను.నాకు కరోనా పాజిటివ్ వచ్చింది.

వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాను.నాకు ఇప్పటికీ జ్వరం, నీరసం ఉన్నాయి.

ప్రస్తుతం తను తన అమ్మమ్మ, చెల్లెలితో కలిసి ఉంటోంది.కాబట్టి వాళ్లకు కూడా పరీక్షలు చేయించానని చెప్పుకొచ్చింది.

వైద్యుల సలహా మేరకు మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లు తీసుకుంటున్నట్లు  నటాషా తెలియజేసింది.తాజాగా ఈమె డేంజరస్ అనే సినిమాలో నటించింది.

కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసు ఇందులో కీలక పాత్రలు పోషించారు.ఆగస్ట్ 14న ఈ సినిమా ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి రానుంది.

తాజా వార్తలు