రారాజు కోసం ఎదురుచూస్తున్నానంటూ పెళ్లిపై కరాటే కళ్యాణి షాకింగ్ పోస్ట్..?

తెలుగు సినీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఇటీవలే శ్రీకాంత్ రెడ్డి అనే ఒక యూట్యూబర్ నీ చెంప దెబ్బలు కొట్టి కొద్ది రోజులపాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే.వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడమే కాకుండా కేసులు కూడా పెట్టుకున్నారు.

ఇకపోతే తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కరాటే కళ్యాణి అప్పుడప్పుడు అభిమానులతో పలు విషయాల గురించి పంచుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే కొన్నిసార్లు తన పర్సనల్ విషయాల గురించి కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా కరాటే కళ్యాణి ప్రేమ, పెళ్లి విషయంలో తన సొంత అనుభవాలను పంచుకుంది.మగవాళ్లు అందరూ మోసగాళ్లే నంటూ.

Advertisement

ప్రేమ పేరుతో మోసపోయిన కంటే సోలోగా బ్రతకడమే బెస్ట్ అంటూ పోస్ట్ చేసింది.ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నీ అంత మంచి మనసు లేదు.

నువ్వు తోపు తురుము అని నీతో జీవితాంతం ఉంటా.లేకపోతె చచ్చిపోతా అని నిన్ను ముగ్గులోకి దించేది వాడే.

మోజు తీరాక అంటే కొంత కాలం గడిపిన తర్వాత నీ డామినేషన్ ఏంటి మూసుకొని కూర్చో లేదా వేరే పెళ్లి చేసుకుంటే ఎక్కువ మాట్లాడకు అంటాడు.

అప్పటికే నువ్వు వాడి మత్తులో ఉంటావు.పిచ్చిదానిలా నువ్వు చెప్పింది చేస్తా నాన్న కన్నా నన్ను వదలకు అని ప్రాధేయపడి వాడికి సొమ్ములు ఇస్తావు.అడుగులకు మడుగులు ఒడ్డీ అతనితోనే ఉంటావు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇక అప్పటి నుంచి భర్త డామినేషన్ మొదలవుతుంది.ఎక్కడికి వెళ్లావు వాడెవడు వీడెవడు.

Advertisement

మీ అమ్మ రాకూడదు మీ తమ్ముడికి రాకూడదు.పిల్లలు పుట్టిన తర్వాత జాబ్ మానేయాలి ఇలా ప్రతి ఒక్క విషయంలో డామినేట్ చేస్తారు.

అంతటితో ఆగకుండా తాగి వచ్చి కొడతారు.ఇలా ప్రేమ దోమ అనగానే పడిపోతే ఇదే విధంగానే ఉంటుంది.

అందుకే వాళ్లను ఎక్కడ తన్నాలో అక్కడే తంటే బాగుంటుంది అంటూ కళ్యాణి తన సోషల్ మీడియా ఖాతాలో సుదీర్ఘమైన పోస్టును రాసుకొచ్చింది.

తాజా వార్తలు