ప్రభాస్ కి నేనంటే క్రష్ అంటున్న భాగ్యశ్రీ

మైనే ప్యార్ కియా సినిమాతో ఇండియా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన నటి భాగ్యశ్రీ.

ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యింది.

ఇందులో నటించిన సల్మాన్ ఖాన్ కి, అలాగే హీరోయిన్ భాగ్యశ్రీకి ఈ సినిమా స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చింది.అయితే ఆ సినిమాతో వచ్చిన స్టార్ డమ్ ని ఆమె ఎక్కువ కాలం కొనసాగించలేదు.

చాలా తక్కువ సినిమాలు చేసి తరువాత ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని నటనకి దూరం అయ్యింది.అయితే చాలా కాలం తర్వాత పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ తో మరల భాగ్యశ్రీ రీఎంట్రీ ఇస్తుంది.

ఈ సినిమాలో భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కీలక పాత్రలో కనిపించబోతుంది.ఈమె నటించడం వలన సినిమాకి కూడా మంచి క్రేజ్ వచ్చింది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించడం, అలాగే ప్రభాస్ తో కలిసి నటించడంపై భాగ్యశ్రీ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.ప్రేమ పావురాలు చిత్రంలో నటించడం నా అదృష్టంగా భావిస్తుంటాను.

ఎందుకంటే ఎన్నో పేరు ప్రతిష్టలను, అభిమానులను ఆ చిత్రం ఇచ్చింది.ఇంకో విషయం ఏమిటంటే నా కోసం ఆ సినిమా కథను ఏడు సార్లు మార్చారు.

ఎనిమిదో సారి తిరస్కరించలేక అంగీకరించాను.మొట్టమొదటిసారి తెలుగు సినిమా చేస్తున్న మొదటి రోజు ఏడ్చేశాను.

తెలుగు భాష తనకి అస్సలు అర్ధం కాలేదు.తర్వాత రెండు మూడు రోజులకి భాషని అర్థం చేసుకున్నాను.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
రామ్ చరణ్ ఆ విషయం లో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు..?

ప్రభాస్‌తో చేస్తున్న రాధేశ్యామ్‌ సినిమాలో తాను ఎందుకు నటించాను అనేది సినిమా చూస్తేగానీ ఎవరికీ తెలియదు.తన ప్రేమపావురాలు సినిమా చూసి ప్రభాస్‌ తన మీద క్రష్‌ ఫీలైనట్లు చెప్పాడని, రాధేశ్యామ్‌ టీమ్‌ అంతా తనని చాలా చక్కగా చూసుకున్నారని, హైదరాబాద్‌ మిఠాయిలు కూడా గిఫ్ట్‌లుగా ఇచ్చారని భాగ్యశ్రీ పేర్కొంది.

Advertisement

మొత్తానికి రాధేశ్యామ్ సినిమా నటిగా తన రీ ఎంట్రీకి గ్రాండ్ వెల్ కమ్ మూవీ అని ఈ సందర్భంగా భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు