పదేళ్ల బంధానికి స్వస్తి పలికిన నటుడు.. ఆమె మంగళసూత్రానికి నాకు రుణం చెల్లిపోయిందంటూ?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం విడాకులు తీసుకొని విడిపోవడం అన్నది కామన్ అయిపోయింది.

అన్ని ఇండస్ట్రీలో ఈమధ్య ఇది బాగా ట్రెండ్ అయిపోయింది.

ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకొని విడిపోయి షాక్ ఇస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక నటుడు విడాకులు తీసుకుని విడిపోయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అతను మరెవరో కాదు.కన్నడ నటుడు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కిర్రిక్‌ కీర్తి.

తాజాగా కీర్తి విడాకులు తీసుకొని విడిపోయినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.తన భార్య అర్పిత గౌడతో విడిపోతున్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు.

Advertisement

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు.నేను, అర్పిత చట్టప్రకారం విడాకులు తీసుకున్నాం.

భార్యాభర్తలుగా మా ప్రయాణానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాము.ఇకపై నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి ఆమెకు ఎటువంటి సంబంధం లేదు.

దానికి గల కారణం.ఆమె మెడలో ఉన్న మంగళసూత్రానికి, నాకు రుణం చెల్లిపోయింది.

తనకు మంచి జీవితం దొరకాలని కోరుకుంటున్నాను.చేదు అనుభవాలను అన్నింటినీ మర్చిపోయి నూతన అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆశిస్తున్నాను.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాకూ అందించండి అని రాసుకొచ్చాడు కీర్తి.

Advertisement

ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు అతనికి మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం అతనిపై మండిపడుతున్నారు.ప్రేమించిన అమ్మాయి కోసం తల్లిదండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు మరి విడాకులు తీసుకుని విడిపోతున్నావు అంటూ అతనిపై ట్రోల్స్ చేస్తున్నారు.కొందరు నెటిజన్స్ ఈ మధ్యకాలంలో ఇది బాగా ట్రెండ్ అయిపోయింది.

ఒకరితో విడాకులు తీసుకొని విడిపోవడం మరొకరితో రిలేషన్ మెయింటైన్ చేయడం అన్నది కామన్ అయిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే కీర్తి వారి వైవాహిక జీవితంలో తలెత్తిన సమస్యల గురించి గతంలోనే పరోక్షంగా హింటిచ్చాడు.అటు అర్పిత సైతం సోషల్‌ మీడియాలో తన పేరు చివరన కీర్తిని తొలగించేయడంతో పాటు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను డిలీట్‌ చేసింది.ఈ జంట ఈ ఏడాది ప్రారంభం నుంచే విడివిడిగా జీవిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఇప్పటికే అర్పిత తన కొడుకు ఆవిష్కర్‌ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.పెద్దల సమక్షంలో వీరి వివాహం జరిగింది.వీరి పెళ్లి జరిగి దాదాపు పదేళ్లవుతోంది.గతంలో వీరు జోడి నెం.1 రియాలిటీ షోలోనూ జంటగా పాల్గొని రన్నరప్‌గా నిలిచారు.

తాజా వార్తలు