ఉగాది పంచాంగం ప్రకారం.. ఈ రాశుల వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే..!

మన దేశంలో ఉగాది పండుగను( Ugadi festival ) ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధి నామ సంవత్సరం( Sri Krodhi Nama year ) ప్రారంభం కాబోతోంది.

ఇంకా చెప్పాలంటే ఈ ఏడాదిలో ఈ రాశుల వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే క్రోధి నామ సంవత్సరం మేషరాశి ( Aries )వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది.ఆదాయం భారీగా పెరుగుతుంది.

అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అలాగే ఈ సంవత్సరం మిధున రాశి ( Gemini )వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది.హోల్ సేల్, రీటైల్ వ్యాపారులు ఆశించిన దాని కన్నా ఎక్కువ లాభాలను పొందుతారు.ప్రైవేట్, ప్రభుత్వ రంగాలకు చెందిన కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు లభిస్తాయి.

అలాగే తుల రాశి ( Libra )వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు అత్యధిక లాభాలను పొందే అవకాశం ఉంది.

అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారు గతంలో కన్నా ఎక్కువ లాభాలను పొందుతారు.

అలాగే మకర రాశి వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది.రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగా లాభ పడతారు.బంగారు వ్యాపారులకు మొదటి ఆరు నెలల కన్నా తర్వాత ఆరు నెలలు బాగుంటుంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
ఉల్లి, ఉసిరి క‌లిపి ఇలా తీసుకుంటే..ర‌క్త‌హీన‌త ప‌రార్‌!

ఈ ఉగాది నుంచి మీనరాశి వ్యాపారులకు అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి.కొత్తగా ఏ వ్యాపారం ప్రారంభించిన సక్సెస్ మీ సొంతమవుతుంది.

Advertisement

షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు అధిక లాభాలను పొందుతారు.శని గురుడు అనుకూల ఫలితాలను ఇవ్వడం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది.

తాజా వార్తలు