నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

నల్లగొండ జిల్లా:నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు నాంపల్లి సతీష్ ఆధ్వర్యంలో తహసిల్దార్ ఆఫీస్ లో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

గిరిజన గ్రామాలు అధికంగా మండలంలో బడుగు బలహీన వర్గాలకు నిరుపేద విద్యార్థులు పై చదువుల కొరకు దూర ప్రాంతాలకు వెళ్లలేక అర్దిక ఇబ్బందులు ఎదురై చదువుకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలన్నారు.

మూడు జూనియర్ కళాశాలలు ఉన్న నాంపల్లిలో ప్రతి సంవత్సరం 500 నుండి 700 వరకు విద్యార్థులు ఇంటర్ విద్య పూర్తి చేసి పై చదువుల నిమిత్తం హైదరాబాదు,దేవరకొండ, మాల్,నల్లగొండ లాంటి ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక ఎంతోమంది కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని,అమ్మాయిలైతే చిన్న వయసులో పెళ్లి చేసి పంపే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.నాంపల్లి మర్రిగూడ, గుర్రంపోడ్,చింతపల్లి మండలాలకు గాను నాంపల్లి మండల కేంద్రంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల భవిష్యత్తుకు తొడ్పాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

లేనియెడల రానున్న రోజులలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చెప్పడతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దాచేపల్లి నర్సింహా, చిరుమామిళ్ల గిరిబాబు, పోలగోని శ్రీకాంత్,కార్యదర్శి వల్లపు కోటేష్,ప్రధాన కార్యదర్శిలు మేకల శ్రీకాంత్, మరుపాకల శివ గౌడ్,కోరే సైదులు,కొట్ర శ్రీకాంత్,కర్నాటి సాంబశివ,నాంపల్లి శంకర్, సీతారాం,ధరమ్ సింగ్,వేముల స్వామి,గుండమళ్ళ మహేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
పుష్ప 2 సినిమా పేరు చెబితే చాలు బాలీవుడ్ భయపడుతుందా..?

Latest Nalgonda News