మునుగోడులో దూసుకెళ్తున్న కారు.. చివరి దశకు ఓట్ల లెక్కింపు

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చివరి దశకు చేరుకుంది.12వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి టీఆర్ఎస్ ఆధిక్యం 7,794కి పెరిగింది.

12వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు 7,440 ఓట్లతో ఆధిక్యంలో ఉంది.

బీజేపీకి 5,398 ఓట్లు వచ్చాయి.మునుగోడు కౌంటింగ్ లో 2, 3వ రౌండ్ మినహాయిస్తే ప్రతి రౌండ్ లోనూ టీఆర్ఎస్ కే ఆధిక్యం లభించింది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంబురాల్లో మునిగి తేలుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.బాణసంచా కాల్చి, స్వీట్స్ పంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు