హీరోయిన్‌కు నిర్మాత ఖరీదైన గిఫ్ట్‌

సినిమా ఇండస్ట్రీలో బహుమతులు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం చాలా కామన్‌ అనే విషయం తెల్సిందే.అయితే ఖరీదైన బహుమతులు ఇచ్చినప్పుడు అది హాట్‌ టాపిక్‌ అయ్యి తీరుతుంది.

ఇప్పుడు ఒక బహుమతి హాట్‌ టాపిక్‌ అయ్యింది.ఛార్మి హీరోయిన్‌గా నటించిన ‘జ్యోతిలక్ష్మి’ నిర్మించిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఒక ఖరీదైనా డైమండ్‌ రింగ్‌ ఇచ్చాడు.పులి ఆకారంలో ఉండటం ఆ రింగ్‌ ప్రత్యేకత.

అతి ఖరీదైన ఆ గిఫ్ట్‌ను అందుకున్న ఛార్మి ఫుల్‌ హ్యాపీగా ఉంది.తన పుట్టిన రోజున ఇంత మంచి కానుక ఇచ్చిన నిర్మాత కళ్యాణ్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పింది.

ఈ పుట్టిన రోజు ఛార్మికి ఎంతో ప్రత్యేకం.ఈ పుట్టినరోజునే ఛార్మి నటించిన ‘జ్యోతి లక్ష్మి’ సినిమా ట్రైలర్‌ విడుదల అయ్యింది.

Advertisement

పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముస్తాబు అవుతోంది.ఈ సినిమాలో ఛార్మి వేశ్య పాత్రలో నటించింది.

ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి.ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని పూరి భావిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు