యాదాద్రి భువనగిరి జిల్లా:నువ్వు అవినీతికి పాల్పడుతున్నావంటూ తనకు పూర్తి సమాచారం వచ్చిందని, నిన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని, లేదంటే అరెస్ట్ తప్పదని ఏసీబీ అధికారిని అంటూ ఓ వ్యక్తి కాల్ చేసి బెదిరించడంతో రాజాపేట తహశీల్దార్ దామోదర్ భయపడిపోయి ఆన్లైన్లో రూ.3.30లక్షలు పంపిన వైనం యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం వెలుగులోకి వచ్చింది.దుండగుడు చేతిలో మోసపోయానని గ్రహించిన తహశీల్దార్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడంతో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Latest Suryapet News