ఈ నెల 14 నుండి ఎస్ ఎస్ సి అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షలు

ఎస్‌.ఎస్‌.

సి అడ్వాన్స్‌ సప్లమెంటరీ జూన్‌`2023 పరీక్షలు ఈ నెల 14 నుండి 20 వరకు నిర్వహించబడునని జిల్లా విద్యాధికారి సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇట్టి పరీక్షలు ఉదయం 09.30 గంటల నుండి మధ్యహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని ఆయన అన్నారు.ఇట్టి పరీక్షల పై ప్రశ్నాపత్రాల లీకేజీ, లభ్యత వంటి వదంతులను నమ్మరాదని, అటువంటి వదంతులు ఏమైనా వ్యాప్తిచెందినట్లయితే వెంటనే జిల్లా కలక్టర్‌, పోలీసు కమీషనరు, జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తేవాలని ఆయన తెలిపారు.

విద్యార్దులు, తల్లిదండ్రులు పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లు, పేజర్లు, ఎటువంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లను అనుమతింబడవని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!
Advertisement

Latest Khammam News