నర్సాపురం వైసీపీ ఎంపీ రఘు రామకృష్ణంరాజు కు సిఐడి అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి అందించారు.
ఈనెల 17వ తేదీన సిఐడి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా శ్రీశైలం వైసిపి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఏపీ తెలంగాణ విభజన అంశాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ బల్లా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,94,720 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
317 జీవోను నిలిపివేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కామెంట్స్ చేశారు.సీఎం కేసీఆర్ ముందు ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి దొరా అంటూ షర్మిల సెటైర్లు వేశారు.
ఏపీలో థియేటర్ల సమస్య తాను ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి పై కేంద్రం సీరియస్ గా ఉందని ఆయన ఎప్పుడైనా జైలుకు వెళ్లే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
సికింద్రాబాద్ రాణి గంజి లోని ఫిలిప్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.
వేములవాడ రాజన్న క్షేత్రం లో అధికారులు చర్యలు చేపట్టారు.ఈ నెల 13న ముక్కోటి ఏకాదశి రోజున భక్తులను ఆలయంలోనికి అనుమతించలేదు లేదని అధికారులు తెలిపారు.
పూర్వ మహబూబ్ నగర్ జిల్లా గద్వాల లోని కరువు ప్రాంతానికి జూరాల రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తి పోయడానికి వీలుగా 581.06 కోట్లతో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతి ఇవ్వడంతో గురువారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
సరైన అనుమతి పత్రాలు లేకుండా సంక్రాంతి సందర్భంగా అనేక ప్రాంతాలకు బస్సు నిర్వహిస్తున్న 42 బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.
కర్నూల్ జిల్లా ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి పంట పొలాల్లో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
తమిళనాడు లో సంపూర్ణ లాక్ డౌన్ కారణంగా జల్లికట్టు ను వాయిదా వేశారు.
విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కోడిపందేలపై ఆంక్షలు విధించినట్లు సీపీ కాంతి రాణా టాట తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కరోనా కు నాటు మందు అందించిన కృష్ణపట్నం అనందయ్య కు ఆయుష్ శాఖ నోటీసులు జారీ చేసింది.
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,940 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 48,940.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy