బిగ్ బాస్ ప్రోమో.. గ్రాండ్ లెవల్ లో ఫినాలే.. బిగ్గెస్ట్ స్టార్స్ తో సర్వం సిద్ధం!

బిగ్ బాస్ తెలుగు నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు ఐదవ సీజన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంటుంది.

ఇప్పటికే సీజన్ 5 వంద రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని గ్రాండ్ ఫినాలే కు చేరుకుంది.

ఇక ఈ రోజుతో బిగ్ బాస్ సీజన్ 5 ముగియ నుంది.కాజల్ ఎలిమినేట్ అవ్వడంతో సిరి, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్, సన్నీ గ్రాండ్ ఫినాలే కు చేరుకున్నారు.

ఈ ఆదివారం బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది.ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ కు సర్వం సిద్ధం అయ్యింది.

ఈ రోజు సాయంత్రం ప్రసారం కానున్న గ్రాండ్ ఫైనల్స్ తో ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించడానికి నాగార్జున కూడా రెడీ అయ్యాడు.మరి కొన్ని గంటల్లోనే ఈ ఎపిసోడ్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ వరుస ప్రోమోలను రిలీజ్ చేస్తూ ఈ ఫైనల్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తిని పెంచుతున్నారు.

Advertisement

తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతూ.వెల్కమ్ టు ది గ్రాండ్ దినాలే అంటూ స్టార్ట్ చేసి హౌస్ మేట్స్ తో టునైట్ మీరు స్టార్స్ కానీ.మీరు చాలా మంది స్టార్స్ ని చూడబోతున్నారు.

అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరెవరు గెస్టులుగా రాబోతున్నారో వారిని ఇన్ వైట్ చేసాడు నాగార్జున.దీంతో ఇప్పటి వరకు గెస్టులుగా వస్తున్నా వారు ఎవరా అని అందరు అనుకున్నారు కానీ ఈ ప్రోమోతో క్లారిటీ ఇచ్చేసారు.

బిగ్ బాస్ ఫినాలే కి పుష్ప టీమ్, శ్యామ్ సింగ రాయ్ టీమ్, బ్రహ్మాస్త్ర టీమ్, పరంపర టీమ్, రాజమౌళి విచేసినట్టు కనిపించింది.ముందుగా రాజమౌళి, ఆలియా భట్, రణబీర్ కపూర్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుకుమార్, రష్మిక మందన్న, దేవి శ్రీ ప్రసాద్, కృతి శెట్టి, సాయి పల్లవి, నాని కనిపించారు.ఆలియా భట్ చెప్పిన దబిడిదిబిడే అనే డైలాగ్ ఆకట్టుకుంది.

రష్మిక సామీ సామీ స్టెప్పుతో అదరగొట్టింది.మొత్తానికి ప్రోమో మొత్తం గ్రాండ్ లెవల్ లో ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు