వైరల్... అందరూ చూస్తుండగానే ఘోరం...అసలేమైందంటే?

కొన్ని కొన్ని ఘటనలు జరిగినప్పుడు ప్రస్తుతం సమాజం మనుషులు ఎలా ఉన్నారనే దానిపై ఒక స్పష్టత వస్తుంది.

ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఉన్నంత విపరీతంగా లేనప్పుడు ఎంతో కొంత సమాజంలో మానవత్వం అనేది ఉండేది.

కాని సోషల్ మీడియా హవా మొదలైన తరువాత ప్రతి దానిని ఫోటోలు, వీడియోలు తీయాలని, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారే తప్ప కళ్ల ముందు ఎంత పెద్ద ఘొరం జరుగుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోతున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది.ఇలా ఘోరాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంతో ప్రాణాలు విడిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫారం మీద ప్రయాణికులు చాలా మంది ఉన్న సమయంలో ఓ వలస కూలి ప్లాట్ ఫారం మీదికి వస్తున్న సమయంలో ట్రైన్ కి ఎదురుగా నిలబడి అలాగే ట్రైన్ క్రింద పడి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఒకసారిగా నెట్టింటిని షేక్ చేసిందని చెప్పవచ్చు.ప్లాట్ ఫారంపై అంతా మంది ఉన్నా ఏ ఒక్కరూ అతనిని ఆపడానికి ప్రయత్నించినా ఆ వలస కూలీ ప్రాణాలు నిలబడేవని సాటి మనుషులుగా స్పందించరా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అయితే ఈ ఘటన పట్ల చాలా మంది రాను రాను మానవ సంబంధాలు తెగిపోతున్నాయంటూ సాటి మనిషి కళ్ల ముందే చనిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారంటే ఇంత కంటే ఘోరమైన సంఘటన ఇంకోటి ఉంటుందా అని నెటిజన్లు మండి పడుతున్నారు.ఏది ఏమైనా సదరు వ్యక్తి ట్రైన్ కు ఎదురుగా నిల్చొని ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్దంగా ఉన్న ఫోటో మొత్తం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.ఇలాంటి ఘటన మరొక్కటి జరగకూడదని కోరుకుందాం.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు