బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం తెలుగులో ఐదవ సీజన్ ప్రసారమవుతుంది.
గత మూడు సీజన్ నుంచి ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.19 మంది కంటెస్టెంట్ లో ప్రారంభమైన ఈ సీజన్ ప్రస్తుతం తొమ్మిది మంది హౌస్ నుండి ఎలిమినేట్ కాగా 10 మంది ఉన్నారు.వీరిలో జెస్సీ అనారోగ్యం కారణంగా సీక్రెట్ రూమ్ లో ఉండగా హౌస్ లో కేవలం తొమ్మిది మంది మాత్రమే టాస్క్ లలో పాల్గొంటున్నారు.
ఇక నేటితో ఈ కార్యక్రమం పది వారాలు పూర్తి చేసుకోనుంది.ఇకపోతే శని ఆదివారాలలో నాగార్జున బిగ్ బాస్ వేదిక పైకి వచ్చి హౌస్ సభ్యులను ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.
ఎప్పుడు మాదిరిగానే నాగార్జున శనివారం హౌస్ సభ్యులతో ముచ్చటించారు.అయితే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ హోస్ట్ అంటే కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ లు ఎలాంటి తప్పిదం చేసిన వారందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఇది తప్పు ఇది రైట్ అని చెప్పాల్సిన బాధ్యత హోస్ట్ కి మాత్రమే ఉంటుంది.
అయితే ఈ సీజన్లో హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ కార్యక్రమం మొదటి నుంచి హోస్ట్ గా సరైన సమ న్యాయం చేయలేదని నెటిజన్ల అభిప్రాయం.ఏదో బిగ్ బాస్ నిర్వాహకులు ఒక పేపర్ పై స్క్రిప్ట్ రాసిస్తే అదే అక్కడికి వచ్చి నాగార్జున మాట్లాడతారు తప్ప అసలు ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం ఎవరు తప్పు చేశారు ఎవరిది తప్పు లేదు అనే విషయం గురించి ఆరా తీయరు.
కేవలం తనకు కావాల్సిన వారికి మాత్రమే వార్నింగ్ ఇస్తూ తను సపోర్ట్ చేయాల్సిన వారికి మాత్రమే సపోర్ట్ చేస్తూ వచ్చారు.
గత కొన్ని వారాల నుంచి నాగార్జున ఇదే తంతు కొనసాగిస్తున్నారు.తాజాగా శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సిరి సన్నీ మధ్య తారస్థాయిలో గొడవ చోటుచేసుకుంది.ఆట ఆడేటప్పుడు పట్టుకుంటే నేను తంతా అంటూ సన్నీ అనడం వల్ల ఈ గొడవ చోటు చేసుకుంది.
అయితే సన్నీ ఈ ఒక్క మాట అంటే సిరి మాత్రం నువ్వు అప్పడాలు అమ్ముకో.నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే రా వచ్చి తను చూస్తా అంటూ సిరి ఎంతో రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది.
ఇలా ఈ గొడవలో సిరి సన్నీ ఇద్దరు తప్పులు ఉన్నాయి.ఇక కాజల్ ను టార్గెట్ చేస్తూ అని మాస్టర్ నాగిని నాగిని అంటూ పిచ్చి పట్టినదానిలా మాదిరి చేసింది.
అయితే ఈ గొడవంతా నాగార్జునకి తెలిసినప్పటికీ కేవలం శనివారం సన్నీని టార్గెట్ చేస్తూ అతనిదే తప్పు ఉందని నువ్వు తంతా అన్నావా? లేదా? అన్నావా లేదా అంటూ తనకు రావాల్సిన సమాధానాన్ని మాత్రమే రాబట్టారు.
ఈ గొడవలో సన్నీ తప్పు ఎంత ఉందో అంతకు ఎక్కువ తప్పు సిరి షణ్ముక్ అని మాస్టర్ ది కూడా ఉంది.మరి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున వీరిద్దరితో మాట్లాడి ఎవరిది తప్పు ఎవరిది తప్పు కాదు అనే విషయం తెలుసుకోకుండా కేవలం సన్నీ మాత్రమే తప్పు చేశాడని తనని ముద్దాయిగా ఇస్తూ మాట్లాడటం తను చేస్తున్న హోస్ట్ పదవికి నాగార్జున న్యాయం చేయలేదని చెప్పాలి.ఇలా నాగార్జున ఏకపక్షంగా మాట్లాడటంతో నెటిజన్లు నాగార్జున పై తారాస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా నాగార్జునను ఏకిపారేస్తున్నారు.
అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు తప్పు చేస్తే ముందు హోస్ట్ కి వార్నింగ్ ఇవ్వాలి.హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు దారి తప్పుతున్నారు అంటే హోస్ట్ సరిగా లేరని అర్థం.ఇలా ఏకపక్షంగా నాగార్జున వ్యవహరిస్తూ హోస్ట్ పదవికి అన్యాయం చేశారని దీని కారణంగా నాగార్జున పై కేస్ ఫైల్ చేయాలి అంటూ పలువురు నెటిజన్లు నాగార్జున పై తారాస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy