పాదయాత్రకు రెడీ అయిన మరో తెలంగాణ కీలక నేత..!!

2023లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటి నుండే తెలంగాణ రాజకీయాల్లో పాదయాత్ర ఫార్ములా కొంతమంది నాయకులు స్టార్ట్ చేయడం జరిగింది.

ముందుగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ప్రకటించి ప్రస్తుతం చేస్తూ ఉన్నారు.ఆ తరువాత బిజెపి పార్టీలో చేరిన ఈటెల రాజేందర్.

ఇటీవల హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు.ఇక ఆ తర్వాత అక్టోబర్ మాసంలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు.

వైయస్ షర్మిల రాజన్న రాజ్యంఅంటూ.పాదయాత్ర స్టార్ట్ చేసి ఇప్పటికే వంద కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది.

Advertisement

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరో కీలక నేత దాదాపు రెండు వేలకి పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఆయన మరెవరో కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత మధుయాష్కిem>టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మధుయాష్కి ప్రజా చైతన్య యాత్ర టైటిల్ పేరిట.

ఈ యాత్ర చేపట్టాలని రాష్ట్ర.జాతీయ సమస్యలపై స్పందిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకునే  రీతిలో యాత్ర చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు