'EMK' షోకు మరొక పాపులర్ బ్యూటీ !

ఎన్టీఆర్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొక వైపు ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా మన ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ షో చేయడం కొత్తేమి కాదు ఇంతకు ముందు బిగ్ బాస్ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు.

ఇక ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు షో ను కూడా హిట్ చేయడానికి తన వంతు కృషి చేస్తున్నాడు తారక్.జెమిని టివి రేటింగ్స్ పెంచడం కోసం ఎవరు మీలో కోటీశ్వరులు షోలో స్టార్ అతిధులను రంగం లోకి దించుతున్నారు.

ఇప్పటికే పలువురు స్టార్ నటులను ఈ షో తీసుకువచ్చింది.తాజాగా మహేష్ బాబు, సమంత కూడా ఈ షో లో పాల్గొన్నట్టు తెలిసింది.

మహేష్ ఎపిసోడ్ ఎప్పుడో షూట్ అయిపోగా తాజాగా రెండు రోజుల క్రితం సమంత కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షో లో పాల్గొన్నట్టు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.ఇక మహేష్ బాబు ఎపిసోడ్ దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

Advertisement

సమంత ఎపిసోడ్ ఈ నెల చివర విడుదల చేస్తారు అని టాక్ వినిపిస్తుంది.అయితే తాజాగా ఈ షోలో మరొక స్టార్ బ్యూటీ పాల్గొననున్నట్టు తెలుస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా ఎవరు మీలో కోటీశ్వరులు షో లో పాల్గొన బోతున్నట్టు సమాచారం.

తమన్నా ఈ షోలో హాట్ సీట్ లో కూర్చుని గేమ్ ఆడబోతుందని ఈ ఎపిసోడ్ వచ్చే వారం షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తుంది.తమన్నా కూడా మొన్నటి వరకు తెలుగులో మాస్టర్ చెప్ కు హోస్ట్ గా చేసింది.కానీ ఈ మధ్య తమన్నా ఈ షో హోస్ట్ గా చేయడం లేదు.

ఈ స్థానంలో అనసూయ ను యాంకర్ గా తీసుకున్నారు.మరి చూడాలి వరుసగా జెమిని టివి ఇచ్చే సర్ప్రైజ్ ల వల్ల అయినా ఈ షో రేటింగ్స్ పెరుగుతాయో లేదో.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు