సొంత పార్టీ నేతలపై సీరియస్ కామెంట్లు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..!!

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్‌పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కీలక నేతల పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకత్వం మొత్తం మార్చాల్సిందే అని మీడియా సముఖంగా ధ్వజ మెత్తారు.

తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండే జిల్లాలలో ఒక జిల్లా అనంతపురం.ఇటువంటి అనంతపురం జిల్లాలో ఇద్దరు కీలక నాయకులు.

వలన పార్టీ సర్వ నాశనం అవుతుందని, వాళ్ల పేర్లు మరో కార్యక్రమంలో చెబుతాను అంటూ సొంత పార్టీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు.ఆ ఇద్దరికి రాజకీయం చేతకాదు దండాలు పట్టించుకోవడమే.

అన్న తరహాలో వ్యవహరిస్తున్నారు వారివల్ల జిల్లా లో పార్టీ బలహీన పడుతుందని ఈ విషయంలో అధిష్టానం కలగజేసుకుని మార్పులు చేయాలని జెసి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Advertisement

రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలని తర్వాత ప్రాజెక్టుల గురించి ఆలోచించండి అంటూ టీడీపీ పెద్దలకు ఆయన సూచించారు.టిడిపి కార్యకర్తల విషయంలో చంద్రబాబు ఇప్పటికైనా మేలుకో వాలని.

పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు