దీక్షకు కూర్చున్న వైయస్ షర్మిల..!!

ప్రతి మంగళవారం తెలంగాణ వైయస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.

మొట్టమొదటిసారిగా పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టిన షర్మిల ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల టైంలో తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారీగా నోటిఫికేషన్ లు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటల పాటు దీక్ష చేశారు.

అయినా కానీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం రాష్ట్రంలో ఆయా చోట్ల దీక్ష చేపడుతున్న షర్మిల ఈసారి నల్గొండ జిల్లాలో దీక్షకు కూర్చున్నారు.సాయంత్రం 6 గంటల వరకు ఈ నిరుద్యోగ దీక్ష జరగనుంది.

ఈ క్రమంలో దీక్షకు కూర్చోనక ముందు ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ కుటుంబాన్ని షర్మిల పరామర్శించడం జరిగింది.ఈ క్రమంలో దీక్షా ప్రాంగణం వద్దకు వైఎస్సార్ అభిమానులు పార్టీ కార్యకర్తలు అదే రీతిలో ఉద్యోగులు భారీగా తరలివచ్చారు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు