రిస్క్ తీసుకుంటున్న నాగచైతన్య.. తక్కువైనా ఓకే?

ప్రస్తుతం సినిమా షూటింగ్ లన్ని కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడగా థియేటర్లు కూడా బంద్ చేశారు.

దీంతో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు విడుదల వాయిదా పడగా ఓటీటీ లో కూడా విడుదల చేయలేని పరిస్థితిలో ఉన్నాయి.

చాలావరకు విడుదలకున్న సినిమాలన్నీ థియేటర్లు తెరుచుకున్న వెంటనే విడుదల చేయనున్నారు.ఇక ఈ నేపథ్యంలో నాగచైతన్య సినిమా కూడా అప్పుడే విడుదల కానుంది.

థియేటర్లు 100% తో కాకుండా 50 శాతం ఆక్యుపెన్సీ తో ఓపెన్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక నాగ చైతన్య తన సినిమాను కూడా పూర్తి స్థాయి వరకు ఎదురు చూడకుండా 50 శాతానికైనా సరే విడుదల చేయాలనుకుంటున్నారని తెలుస్తుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన సినిమా లవ్ స్టోరీ.ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.నారాయణ దాస్, పి రామ్ మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

ఇక ఈ సినిమాను ఏప్రిల్ 16న విడుదల చేయాలని గతంలోనే ప్రకటించగా అప్పుడే కోవిడ్ వ్యాపించడంతో విడుదల వాయిదా వేశారు.

దీంతో ప్రస్తుతం ఈ సినిమాను ఎలాగైనా విడుదల చేయాలని సినీ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు విడుదల కాగా సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని ప్రశ్నలు కూడా ఎదురవడంతో ఎలాగైనా ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారట.

ఇక ఈ నెల ఆఖరి వారంలో లేదా వచ్చే నెల లో థియేటర్లు 50 శాతం తో తెరుచుకున్న వెంటనే విడుదల చేయనున్నారు.మొత్తానికి ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగ చైతన్య తక్కువ శాతం అయినా సరే రిస్కు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

సరైన సక్సెస్ లు లేకపోవడంతో ఈ సినిమా నాగచైతన్య కు ఎటువంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు