పార్లమెంట్ వ్యవస్థను మోదీ ప్రభుత్వం( Modi Govt ) ధ్వంసం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) అన్నారు.పార్లమెంట్ లో బిల్లులపై కనీసం చర్చ కూడా చేయలేదని పేర్కొన్నారు.
ఎప్పుడూలేని విధంగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.మరోసారి మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియాలాగా దేశం తయారు అవుతుందని విమర్శించారు.
అగ్నివీర్( Agniveer ) దేశ రక్షణకు మంచిది కాదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశాన్ని విభజించాలని బీజేపీ ఆలోచిస్తుందని ఆరోపించారు.ఈ క్రమంలోనే బీజేపీకి( BJP ) తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని తెలిపారు.
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) ఒక్క సీటు కూడా గెలవదని వెల్లడించారు.