రేపు సాయంత్రం నుంచి తెలంగాణలో వైన్ షాపులు బంద్

తెలంగాణలో వైన్ షాపులు( Wine Shops ) బంద్ కానున్నాయి.ఈ మేరకు రేపు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.

 Wine Shops Will Be Closed In Telangana From Tomorrow Evening Details, Election C-TeluguStop.com

పోలింగ్ కు 48 గంటల ముందు నుంచి మద్యం షాపులను మూసివేయాలని ఎన్నికల కమిషన్( Election Commission ) కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈసీ ఆదేశాల మేరకు రేపు సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్ కానున్నాయి.

లోక్ సభ ఎన్నికల( Loksabha Elections ) నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ఆబ్కారీ శాఖకు సర్క్యూలర్ జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.

అదేవిధంగా జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా కూడా మద్యం షాపులు బంద్ కానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube