చంద్రబాబు పై సీరియస్ కామెంట్లు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి..!!

ఏపీ ప్రభుత్వ సలహాదారుడు వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా రియల్ తీసుకుంటుందని పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సీరియస్ కామెంట్ చేశారు.కరోనా టీకాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండవని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయన్న విషయం కూడా చంద్రబాబుకు తెలియదా అంటూ ప్రశ్నించారు.

పక్క రాష్ట్రంలో ఉంటూ ప్రవాసాంధ్రుడు మాదిరిగా జూమ్ మీటింగులు పెట్టుకుంటూ.కరోనా విషయంలో పోరాడుతున్న ప్రభుత్వంపై బాబు విమర్శలు చేయడాన్ని ఖండించారు.

దేశంలో కరోనా కట్టడి చేయడంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ చాలా కీలకంగా రాణిస్తుందని తెలిపారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్ కి ప్రజల భద్రత సంక్షేమం తప్ప మరో ధ్యాస లేదని స్పష్టం చేశారు.

Advertisement

రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూను అమలు చేస్తూ మరో పక్క ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే రీతిలో.ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉందని తెలిపారు.

వ్యాక్సిన్ సకాలంలో అన్ని డోసులు కేంద్రం ఇప్పటికిప్పుడు ఇస్తే 35 రోజులలో అందరికీ వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు ప్రభుత్వం చేసి రెడీగా ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. .

Advertisement

తాజా వార్తలు