రోడ్డుపై దోసెలు వేస్తున్న నటి ఖుష్బూ.. ఎందుకంటే..?

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు నటి ఖుష్బూ.

ఈ మధ్య కాలంలో తెలుగులో ఖుష్బూ అజ్ఞాతవాసి సినిమాలో నటించగా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

అజ్ఞాతవాసి సినిమా తరువాత తెలుగులో మరో సినిమాలో నటించని ఖుష్బూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.బీజేపీ తరపున టికెట్ సాధించిన ఖుష్బూ ప్రచారంలో ఒక టిఫిన్ సెంటర్ లో దోసెలు వేశారు.

ఓటర్లను ఆకర్షించాలనే ఆలోచనతో ఖుష్బూ చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం పరిధిలో దోసెలు వేశారు.థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో పర్యటించిన ఖుష్బూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న ఖుష్బూ తన వంతు కృషి చేస్తున్నారు.ఖుష్బూ సుందర్ ప్రచారానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

మరి ఖుష్బూ ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

తమిళనాడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.డీఎంకే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి.మరోవైపు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న హామీలు ప్రజలే ఆశ్చర్యపోయేలా ఉన్నాయి.

ఎన్నికల్లో గెలవాలనే తాపత్రయంతో ఆచరణ సాధ్యం కాని హామీలను పార్టీలు ఇస్తున్నాయి.మరోవైపు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ప్రచారం చేయడానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రావడంతో పాటు స్మృతి ఇరానీ దాండియా ఆడి పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపారు.

ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు, నేతలు పడుతున్న పాట్లు ఓటర్లకు నవ్వు తెప్పిస్తూ ఉండటం గమనార్హం.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు