టార్గెట్ మార్చుకున్న ఆచార్య..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో మెగా ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర యూనిట్ మరో నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇంకా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆచార్య చిత్రాన్ని మే 13న కాకుండా వేరే తేదీలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

దీంతో ఈ సినిమాను మే 28న రిలీజ్ చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఆ సమయంలో మరో రెండు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ తప్పదని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

మాస్ రాజా రవితేజ ఖిలాడి నందమూరి బాలకృష్ణ నటిస్తున్న బిబి3చిత్రాలు కూడా మే 28న రిలీజ్ అవుతుండటంతో ఈ రెండు సినిమాలకు ఆచార్య గట్టి పోటీనివ్వడం ఖాయమని తెలుస్తోంది.మరి సమ్మర్ క్లాష్ నుండి ఆచార్య వెనకడుగు వేస్తాడా లేక తెగించి బరిలోకి దూకుతాడా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఆచార్య చిత్రంలో చిరుతో పాటు ఓ కేమియో రోల్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆయన లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి.

ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు