మరోసారి గవర్నర్ తో భేటీ కాబోతున్న నిమ్మగడ్డ..!!

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు సాయంత్రం గవర్నర్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కాబోతున్నారు.

సరిగ్గా రేపు పంచాయతీ తొలి విడత ఎన్నికలు జరగనున్న క్రమంలో వైసీపీ పార్టీ మంత్రులు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు తన పై ఇష్టానుసారంగా చేస్తున్న వ్యాఖ్యలపై గవర్నర్ కి ఫిర్యాదు చేసే రీతిలో నిమ్మగడ్డ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి తనపై వైసీపీ మంత్రులు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా గవర్నర్ తో చర్చించనున్నట్లు సమాచారం.ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను గవర్నర్ కి నిమ్మగడ్డ వివరించనున్నారు అట.ఏది ఏమైనా సరిగ్గా ఎన్నికల సమయానికి కొద్ది గంటల ముందు నిమ్మగడ్డ మరోసారి గవర్నర్ నీ కలవడం ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

తాజా వార్తలు