అక్కినేని సుప్రియ ఓటీటీ.. వెనుక ఉన్నది ఎవరు?

టాలీవుడ్‌ లో వరుసగా ఓటీటీలు వస్తున్నాయి.ఇప్పటికే ఆహా ఓటీటీ వచ్చింది.

త్వరలోనే ప్రముఖ నిర్మాత ఒకరు ఓటీటీని తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఈ సమయంలోనే అక్కినేని వారి నుండి కూడా ఓటీటీ వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున మరియు సమంత కూడా ఈ ఓటీటీలో పెట్టుబడులు పెట్టబోతున్నారు.నాగచైతన్య మరియు సమంతలు కీలకంగా ఈ ఓటీటీలో ఉంటారనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌ను అధికంగా అక్కినేని సుప్రియ చూసుకుంటున్నారు.ఆమె పూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Advertisement

ఇప్పుడు ఓటీటీ బాధ్యతలను కూడా ఆమెకే అప్పగించడం వల్ల ఓటీటీని విజయవంతంగా ఆమె ముందుకు తీసుకు వెళ్తారనే అభిప్రాయంలో అక్కినేని ఫ్యామిలీ ఉంది.

ఇతరులు అంతా కూడా సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆమె అయితేనే ఓటీటీని బాగా రన్‌ చేయలదనే అభిప్రాయంకు నాగార్జున మరియు ఇతర అక్కినేని ఫ్యామిలీ వచ్చినట్లుగా తెలుస్తోంది.అందుకే సుప్రియ చేతికి ఓటీటీ బాధ్యతలు ఇచ్చేందుకు అందుకు రెడీ అయ్యారు.ఇప్పటికే ఓటీటీకి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

ఓటీటీ తో పాటు ఏటీటీని కూడా కలిపి అక్కినేని వారు తీసుకు రాబోతున్నారు.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రెగ్యులర్‌ ఓటీటీల మాదిరిగా కాకుండా ఈ ఓటీటీలో వచ్చే సినిమాలు అన్ని కూడా సబ్‌ స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి రావు.

అందులో కొన్ని పేపర్‌ వ్యూ పద్దతిలో కూడా విడుదల కానున్నాయి.ఇప్పటి వరకు ఏటీటీలో పేపర్‌ వ్యూ పద్దతిలో వచ్చింది లేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

రెండు వేరు వేరు యాప్స్‌ ఉంటున్నాయి.కాని అక్కినేని వారు తీసుకు రాబోతున్న యాప్‌లో మాత్రం ఈ కొత్త విధానం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

అతి త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇదే నిజమైతే సినీ ప్రేక్షకులకు మరింత వినోదం ఖాయం అంటున్నారు.

తాజా వార్తలు