లాక్ డౌన్ ను ఫుల్లుగా క్యాష్‍ చేసుకుంటున్న శర్వానంద్..?

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

మహానుభావుడు సినిమా తరువాత శర్వానంద్ ఖాతాలో ఆ రేంజ్ హిట్ రాలేదు.

పడిపడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాలు డిజాస్టర్లు కావడంతో శర్వానంద్ మార్కెట్ తగ్గింది.ప్రస్తుతం శర్వానంద్ శ్రీకారం సినిమాలో నటిస్తుండగా ఫ్యామిలీ కథాంశం తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

కరోనా, లాక్ డౌన్ వల్ల గతంలోలా స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు సినిమా షూటింగ్ లలో పాల్గొనడం లేదు.ఇప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలేవీ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.దీంతో శర్వానంద్ శ్రీకారం సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.2021లో కనీసం మూడు సినిమాలు విడుదలయ్యే విధంగా శర్వానంద్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ కంటే తక్కువ మొత్తం రెమ్యునరేషన్ కే శర్వానంద్ నటిస్తూ ఉండటంతో నిర్మాతలు సైతం శర్వానంద్ తో సినిమాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ విధంగా శర్వానంద్ లాక్ డౌన్ ను ఫుల్లుగా క్యాష్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.పారితోషికం కొంత మొత్తం తగ్గించుకున్నా ఎక్కువ సినిమాల్లో నటిస్తూ ఉండటంతో ఆ విధంగా శర్వానంద్ కు ఎక్కువ మొత్తమే అందుతోంది.

Advertisement

గతంలో ఒక సినిమా పూర్తైన తరువాతే మరో సినిమాకు కమిట్ అయిన శర్వానంద్ ప్రస్తుతం ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు నిర్మాణంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.శర్వానంద్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్ అయితే మాత్రం మిడిల్ రేంజ్ హీరోల్లో శర్వా నంబర్ 1 అయ్యే ఛాన్స్ ఉంది.

ఈ సంవత్సరం శర్వానంద్ నటించిన జాను సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు