‘క్రాక్‌’ వార్తలను మళ్లీ కొట్టిపారేసిన దర్శకుడు

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన క్రాక్‌ చిత్రం సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండే.

కాని కరోనా కారణంగా సినిమా వాయిదా పడినది.

సినిమా దాదాపుగా పూర్తి అయ్యింది.అయినా కూడా విడుదలకు నోచుకోవడం లేదు.

కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేయలేదు.ఇటీవలే లాక్‌డౌన్‌ సడలించిన నేపథ్యంలో క్రాక్‌ సినిమాకు సంబంధించిన వర్క్‌ అంతా పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది.

కరోనా కారణంగా పలు సినిమాలు విడుదల వాయిదా పడ్డాయి.వాటిలో కొన్ని ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్మాతలు భావించారు.

Advertisement

క్రాక్‌ సినిమాను కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ప్రముఖ ఓటీటీతో క్రాక్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి.

అయితే ఆ విషయమై దర్శకుడు గోపీచంద్‌ మలినేని క్లారిటీ ఇచ్చాడు.తమ సినిమా ఎప్పుడు థియేటర్లు ఓపెన్‌ అయితే అప్పుడే వస్తుంది.

అంతే తప్ప ఓటీటీలో రాదని క్లారిటీ ఇచ్చేశాడు.గతంలో కూడా క్రాక్‌ సినిమాను ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదని మేకర్స్‌ క్లారిటీ ఇచ్చారు.

దాదాపు రెండు మూడు నెలల తర్వాత కూడా అదే క్లారిటీ ఇచ్చారు.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు