స్పైస్ జెట్ బంపర్ ఆఫర్... ఢిల్లీకి ఫ్రీ టికెట్లు...!?

ప్రయాణికుల కోసం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.మరో మూడు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

స్పైస్ జెట్ సంస్థ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే వారికోసం ఉచితంగా టికెట్లను అందిస్తోంది.ఉచిత టికెట్ పొందాలనుకునేవారికి జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు దీనికోసం ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ను చేసుకోవాల్సి ఉంటుంది.

స్పైస్ డెమోక్రసీ పేరుతో స్పైస్ జెట్ ఉచిత టికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.కానీ ఈ ఉచిత టికెట్లను పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.

ఆన్ లైన్ లో ఉచిత టికెట్ పొందాలనుకునేవారు రిజిష్టర్ చేసుకున్న తరువాత ఫిబ్రవరి 6 వ తేదీన ఎంపికైన వారి వివరాలను స్పైస్ జెట్ సంస్థ వెల్లడిస్తుంది.స్పైస్ జెట్ సంస్థ పేర్లు వెల్లడించిన ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడం కొరకు బేస్ ఛార్జీలు మాఫీ చేయబడిన లింక్ వస్తుంది.

Advertisement

ఎయిర్ లైన్స్ ఫిబ్రవరి 8వ తేదీనే ఢిల్లీకి ప్రయాణించి ఢిల్లీ నుండి తిరిగి వెళితే సంస్థ రెండు టికెట్లపై బేస్ ఛార్జీలను రిఫండ్ చేయనుంది.ఓటు హక్కు కోసం ఉచిత టికెట్లను పొందినవారు ఓటు వేసిన తరువాత సిరా గుర్తును సెల్ఫీ తీసుకొని ఫేస్ బుక్, ట్విట్టర్, ప్రొఫైల్ గా పెట్టుకోవాలని సంస్థ తెలిపింది.

స్పైస్ జెట్ మేనేజింగ్ ఛైర్మన్ అజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ స్పైస్ జెట్ ద్వారా దేశంలో ఎక్కడినుండైనా ఢిల్లీలో ఓటు హక్కు ఉన్నవారు ఉచితంగా ప్రయాణించవచ్చని చెపారు.స్పైస్ బెట్ శక్తివంతమైన మరియు బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని అజయ్ సింగ్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు