హమ్మయ్య చెత్త అంతా వెళ్ళిపోయింది

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయిన నాయకులపై ఇప్పటికీ ఆ పార్టీ నేతలకు కోపం తగ్గలేదో ఏమో కానీ ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తాజాగా ఇదే అంశంపై టీడీపీ మాజీ ఎమ్యెల్యే బోండా ఉమా విమర్శలు చేసారు.

తమ పార్టీ నుంచి చెత్త అంతా వెళ్ళిపోయింది అంటూ ఆయన వ్యాఖ్యానించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.ఈ రోజు మీడియాతో మాట్లాడిన బోండా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, టిడిపి ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో నాయకులూ బిజెపితో టచ్ లో ఉన్నారని, త్వరలోనే వారంతా బీజేపీలోకి వచ్చేస్తారని చెప్పడంపై బోండా మండిపడ్డారు.

టిడిపి నుంచి ఎవరూ వెళ్లరని, ఇప్పటికే పార్టీలో ఉన్న చెత్త అంతా వెళ్లిపోయిందని ఆయన అన్నారు.తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంటుందని, నాయకులూ వెళ్ళిపోతే కొత్త నాయకులను తయారు చేసుకోగలిగిన శక్తి సామర్ధ్యాలు టీడీపీ కి ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే తాజాగా టీడీపీ నుంచి వెళ్లిన వారిని ఉద్దేశించి బోడా ఈ వ్యాఖ్యలు చేశారా లేక ఎన్నికలు ముగిసిన తరువాత టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా తదితరులను ఉద్దేశించి బోండా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది తెలియక అంతా ఇప్పుడు తికమకపడుతున్నారు.

Advertisement
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు