ధృవ సెన్సార్ టాక్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ షూటింగ్ పూర్తి చేసుకోని ఈరోజు సెన్సార్ కి వెళ్ళింది.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని అల్లు అరవింద్ నిర్మించగా, సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

రకుల్ ప్రీత్ కథానాయిక.ఇక సెన్సార్ బోర్డు ఈ సినిమాని U/A సర్టిఫికెట్ తో విడుదలకి పాస్ చేసింది.

తెలుగుస్టాప్ ఇప్పటికే చెప్పినట్లుగా, డిసెంబర్ 9న ధృవ విడుదల కానుంది.ఈ సెన్సార్ టాక్ షో విషయానికి వస్తే, తమిళ సినిమా తని ఒరువన్ కి రిమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం, ఒరిజినల్ సినిమాకి ఏమాత్రం తగ్గలేదని టాక్.

యాక్షన్ ఎపిసోడ్లు ఒరిజినల్ కంటే బాగా వచ్చినట్లుగా వినిపిస్తోంది.ధృవలో కొత్తగా రాసిన 8 కాన్సెప్ట్ కూడా బాగా పండిదంట.

Advertisement

మొత్తం మీద రామ్ చరణ్ కి పెద్ద హిట్ దక్కబోతోందని సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారట.మరి తెలుగు ప్రేక్షకులని ఈ సినిమా అదేరకంగా ఆకట్టుకుంటుందా, చాలాకాలంగా రికార్డులకి దూరంగా రామ్ చరణ్ కెరీర్ ని కొత్త మలుపు తిప్పుతుందా లేదా చూడాలి.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?
Advertisement

తాజా వార్తలు