దారుణం: గ‌దిలో ఊపిరాడ‌క 43 ఆవులు మృతి!

ఈ మధ్యకాలంలో మూగజీవాలు ఎలా మరణిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మొన్నటికి మొన్న కేరళలో ఏనుగు.

నిన్నటికి నిన్న అరటిపళ్ళలో విషం పెట్టి 20 ఆవులను ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి.ఇంకా ఇప్పుడు ఏకంగా 43 ఆవులు మృతి చెందాయి.

ఇంకా ఈ దారుణమైన ఘటన ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో చోటుచేసుకుంది.ఛ‌త్తీస్‌గ‌ఢ్ లోని బిలాస్‌పూర్ జిల్లా తాఖ‌త్‌పూర్ బ్లాక్ ప‌రిధిలోని మెడ్ప‌ర్ గ్రామంలో గ్రామ పంచాయ‌తీ కార్యాల‌యం నుంచి దుర్వాస‌న రావ‌డంతో స్థానికులు త‌లుపులు విర‌గ్గొట్టి చూశారు.ఇంకా ఆ కార్యాలయంలో ఏకంగా 60 ఆవులను కుక్కి ఉండటం చూసి అందరూ షాక్ కి గురయ్యారు.60 ఆవులలోను కేవలం 17 ఆవులు మాత్రమే బ్రతికి ఉన్నాయి.మిగితా 43 ఆవులు ఊపిరి ఆడక మృతి చెందాయి.

దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.ప్రివెన్ష‌న్ ఆఫ్‌ క్రూయ‌ల్టీ టు యానిమ‌ల్స్ యాక్ట్‌, ఐపీసీలోని సెక్ష‌న్ 429 ప్ర‌కారం నిందితుల‌పై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

అయితే ఆ ఆవులను ఎవరు బంధించారు? ఎందుకు బంధించారు అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారని క‌లెక్ట‌ర్ చెప్పారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు