ఇండియన్ నేవీలో 26 రఫేల్ యుద్ధ విమానాలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

భారత నేవీ( Indian Navy ) అమ్ములపొదిలో 26 రఫేల్ యుద్ధ విమానాలు, 3 స్కార్పీన్ క్లాస్ సబ్ మెరైన్‌లు చేరనున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా నేవీ కోసం ఫ్రాన్స్ నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు భారత రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన గురువారం ఇక్కడ జరిగిన డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనను ఆమోదించారు.అధికారిక పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) గురువారం ఉదయం ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లారు.

ఆయన పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు జరగనున్నాయి.నేవీ కోసం 26 రాఫెల్ ఎమ్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.

ఈ విమానాలను దేశంలోని మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో మోహరిస్తారు.నావికాదళం ట్రయల్స్ తర్వాత అమెరికన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎఫ్-18 కంటే రఫేల్ ఎమ్‌కి ప్రాధాన్యతనిచ్చింది.

Advertisement

రఫేల్ ఎమ్ విమానాల కొనుగోలు అవసరాన్ని బట్టి ఆమోదించబడింది.ఈ విమానాలను అంతర్ ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి కొనుగోలు చేస్తారు.ఈ విమానాలను సంబంధిత పరికరాలు, ఆయుధాలు, సిమ్యులేటర్లు, విడిభాగాలు, పత్రాలు, సిబ్బంది శిక్షణ, లాజిస్టిక్ మద్దతుతో కూడిన ప్యాకేజీ కింద కొనుగోలు చేస్తారు.

ఒప్పందం ధర, నిబంధనలు అన్ని సంబంధిత అంశాలు, ఇతర దేశాలకు విక్రయించే ఇలాంటి విమానాల విలువ ఆధారంగా ఫ్రెంచ్ ప్రభుత్వంతో చర్చలు ఉండనున్నాయి.

ఇది కాకుండా, భారతీయ అవసరాల ఆధారంగా పరికరాలు, నిర్వహణ, మరమ్మతు, ఆపరేషన్ హబ్‌లకు సంబంధించిన అంశాలను కూడా చర్చల్లో చేర్చనున్నారు.నేవీకి అవసరమైన ప్రాతిపదికన కొనుగోలు (ఇండియన్) కేటగిరీ కింద మూడు అదనపు స్కార్పెన్ జలాంతర్గాములను కొనుగోలు చేసేందుకు కూడా అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది.రఫేల్ ఫైటర్ జెట్లు( Rafale fighter jets ), స్కార్పెన్ సబ్‌మెరైన్‌ల కొనుగోలుతో ఇండియన్ నేవీ సామర్థ్యం మరింత పెరుగుతుంది.

ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి
Advertisement

తాజా వార్తలు