పుడ్ పాయిజన్ కు గురై 26 మందికి భవానీ భక్తులకు అస్వస్థత..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గోపాలపట్నానికి చెందిన 26 మందికి భవానీ భక్తులు అస్వస్థతకు గురయ్యారు.

పూజల అనంతరం గ్రామానికి చెందిన భవానీ భక్తుడు ఏర్పాటు చేసిన ప్రసాద వితరణలో భాగంగా ఇడ్లీతో చట్నీ ఆహరంగా తీసుకున్నారు భవానీలు.

దీంతో నిన్న రాత్రి నుంచి వాంతులు,విరేచనాలతో బాధపడుతున్నారు.సుమారు 26 మంది భవానీలకు అస్వస్థత నెలకొనడంతో ఆస్పత్రి కి తరలించారు.

వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.భజనకు హాజరైన సమీప నివాసాల ప్రజలు కూడా ఇదే ఆహారం తీసుకోవటంతో మరో 30 మందికి అస్వస్తత అయినట్లు తెలుస్తుంది.

బాధిత భవాని భక్తులు ప్రస్తుతం తుని ప్రభుత్వ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు.

Advertisement
చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు