దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో మంత్రులు, జిల్లా అధ్యక్షులు చర్చించిన ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దీనిలో భాగంగా ఈనెల 5న టిఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది.కలయి సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, గ్రంథాలయాల చైర్మన్ లకు ఆహ్వానం అందించనున్నారు.
తెలంగాణ భవన్ లో దాదాపు 300 మందితో సమావేశానికి ఏర్పాటు చేయాలని, ఉదయం 10:30 గంటల వరకు అందుబాటులో ఉండాలని నేతలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.అనంతరం పార్టీ నేతలు కలిసి లంచ్ చేయనున్నారు.